Dharmana Prasada Rao: జగనన్న సురక్ష’కు రాని వాలంటీర్లను తొలగించండి
Dharmana Prasada Rao: జగనన్న సురక్ష’కు రాని వాలంటీర్లను తొలగించండి
Dharmana Prasada Rao: జగనన్న సురక్ష’కు రాని వాలంటీర్లను తొలగించండి
Dharmana Prasada Rao: జగనన్న సురక్ష కార్యక్రమానికి గైర్హాజరైన వాలంటీర్లను తొలగించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారిని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గుడి వీధి సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కొందరు వాలంటీర్లు ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. వాలంటీర్లు రాకపోవడం ఎంతవరకు సమంజసం. పని చేసేందుకు ఆసక్తి లేకపోతే.. అలాంటి వారు మాకొద్దు. స్వచ్ఛందంగా తొలగిపోవచ్చు’ అని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.