జగన్ తొందరపాటు నిర్ణయానికి న్యాయస్థానం తీర్పు చెంపపెట్టులాంటిది: దేవినేని ఉమా
పోలవరం పై జగన్ తొందరపాటు నిర్ణయానికి న్యాయస్థానం తీర్పు చెంపపెట్టన్నారు మాజీమంత్రి దేవినేని ఉమా. 2019లో అధికారంలోకి రాగానే పోలవరం పవర్ ప్రాజెక్టు కొట్టేయాలని చూశారని ఉమ ఆరోపించారు.
పోలవరం పై జగన్ తొందరపాటు నిర్ణయానికి న్యాయస్థానం తీర్పు చెంపపెట్టన్నారు మాజీమంత్రి దేవినేని ఉమా. 2019లో అధికారంలోకి రాగానే పోలవరం పవర్ ప్రాజెక్టు కొట్టేయాలని చూశారని ఉమ ఆరోపించారు. పోలవరం త్వరగా పూర్తి చేయాలని తపిస్తే, అవినీతి ముద్ర వేయాలని చూశారన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా. అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ పోలవరం టెండర్లను నిలిపివేశారని విమర్శించారు. 2009లో పోలవరం స్పిల్ వే పనులను అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలిపివేయించారని ఆరోపించారు.