రాష్ట్రాన్ని వైసీపీ అంధకారంలోకి నెట్టేస్తోందని... టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. రాజధాని మా జిల్లాలోనే ఏర్పాటు చేస్తారంటూ వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని.. జగన్ మోహన్ రెడ్డి రియలెస్టేట్ కంపెనీలు జిల్లాల వారీగా ప్రకటనలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.. జగన్ సీఎం అయ్యాక అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని విమర్శించారు. పోలవరం పనులు నిలిపివేశారు, బందరు పోర్టు ఆగిపోయిందన్నారు.