పైశాచిక ఆనందం కోసమే ప్రజావేదికను కూల్చివేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఇలాంటి ఉడత ఊపులకు, పోలీస్ కేసులను తాము భయపడబోమన్నారు. ప్రజల కోసం ప్రాణాలు కూడా త్యాగం చేసేందుకు సిద్దమన్నారు. వేలాది మంది రైతుల త్యాగాల తోనే జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న విషయం మరచిపోకూడదన్నారు. కాలం బలీయమైందంటూ కాసేపు వేదాంత ధోరణిలో మాట్లాడిన దేవినేని ఉమా ... పార్లమెంట్లో వైసీపీ పక్ష నేత విజయసాయి రెడ్డిపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు.