పోలవరం వద్ద ధ్వంసమైన రివర్ బండ్‌

Update: 2019-08-10 16:15 GMT

పోలవరం వద్ద గోదావరి నీరు ప్రమాద స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. పోలవరం గ్రామానికి రక్షణగా ఉన్న రివర్‌ బండ్‌ పూర్తిగా ధ్వంసం అయింది. గోదావరి గట్లు వేగంగా కోతకు గురౌతున్నాయి. వరద ఊరిపైకి విరుచుకుపడుతుందనే భయంతో నదీ తీర గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. రాత్రి సమయంలో నిద్రమాని మరీ పోలవరం గ్రామస్థులు కాపలా కాస్తున్నారు. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ..చిమ్మ చీకట్లో విష సర్పాలు కూడా వస్తాయనే భయంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు.

Tags:    

Similar News