కరోనా వైరస్ గురించి ఆందోళన చెందవద్దని ఏపీ సీఎం జగన్ అభయమిచ్చారు. వైరస్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదు అయిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముందు జాగ్రత్తగా ప్రజలు మౌత్ మాస్కులను దగ్గర ఉంచుకోవాలని కోరారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.