కడప జిల్లా జమ్మలమడుగులో నాటు బాంబులు బయటపడటం కలకలం రేపుతోంది. ముద్దనూరు రోడ్డుపక్కన ఉన్న భూమిని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్ చేసేందుకు చదును చేస్తోంది. ప్రొక్లైన్తో చదును చేస్తుండగా నాటు బాంబులు బయటపడ్డాయి. తవ్వినాకొద్దీ నాటుబాంబులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 14 బాంబులు బయటపడ్డాయి. ఇటు విషయం తెలుసుకున్న డీఎస్పీ కృష్ణణ్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.