Tirupati: తిరుమలలో నూతన పరకామణి భవనంలో హుండీ కానుకల లెక్కింపు
Tirupati: ప్రత్యేకమైన ట్రాలీలు, లారీల్లో హుండీల తరలింపు
Tirupati: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో నూతన పరకామణి భవనంలో హుండీ కానుకల లెక్కింపును టీటీడీ అధికారులు ప్రారంభించారు. శ్రీవారి ఆలయంలో ఉన్న హుండీలను అక్కడి నుంచి ఆలయానికి సమీపంలోని నూతన పరకామణి భవనంలోకి ఉదయం తరలించారు. ప్రత్యేకమైన ట్రాలీలు, లారీల్లో హుండీలను తీసుకెళ్లారు. భవనంలో ప్రత్యేక పూజలు, హోమాలు, గోప్రవేశం చేసిన తర్వాత లెక్కింపును ప్రారంభించారు.