Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 9,901 పాజిటివ్ కేసులు...

#Coronavirus, #Covid-19, #Corona Positive, #Andhra Pradesh

Update: 2020-09-12 12:54 GMT

Coronavirus Updates in AP | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 9,901 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 75,465 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,901 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 10,292 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. కడప 09, చిత్తూరు 08, ప్రకాశం 08, నెల్లూరు 07, గుంటూరు 06, కృష్ణా 05, కర్నూల్ 05, విశాఖపట్నం 05, పశ్చిమగోదావరి 04,  అనంతపురం 03, తూర్పుగోదావరి 03, శ్రీకాకుళం 02, విజయనగరం జిల్లాలో 02 చొప్పున మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 5,57,587. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 4,846. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,54,113కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 95,733 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 45,27,593 కరోనా శాంపిల్స్ కు పరిక్షలు నిర్వహించింది ప్రభుత్వం.

ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 75,394, కర్నూల్ జిల్లా 51,184, అనంతపురం జిల్లా 48,785, పచ్చిమ గోదావరి జిల్లా 49,398, చిత్తూర్ జిల్లా 48,441, విశాఖపట్నం జిల్లా 43,433, గుంటూరు జిల్లాలో 44,546, నెల్లూరు లో 42,530, కడప 35,580, ప్రకాశం జిల్లాలో 35,654 కేసులు నమోదయ్యాయి.




 


Tags:    

Similar News