Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 10,548 పాజిటివ్ కేసులు..

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

Update: 2020-08-29 15:06 GMT

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,548 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62,024 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,548 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 8,976 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు 15, నెల్లూరు 11, తూర్పుగోదావరి 08, పశ్చిమగోదావరి 08, అనంతపురం 06, గుంటూరు 06, కర్నూలు 06, ప్రకాశం 05, విశాఖపట్నం 05, శ్రీకాకుళం 04, విజయనగరం జిల్లాలో 04, కడప 02, కృష్ణా 02, చొప్పున మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 4,14,164. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,796. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,12,687కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 97,681 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 36,03,345 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.





Tags:    

Similar News