తిరుపతిలో ఓ యువకుడికి కరోనా లక్షణాలు

Update: 2020-04-01 04:06 GMT

కరోనా కారణంగా ఇప్పటికే భక్తుల దర్శనాలను నిలిపివేసిన తిరుమలలో ఓ యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో అతడిని అధికారులు హుటాహుటిన క్వారంటైన్‌కు తరలించారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను పద్మావతి నిలయంలోని క్వారంటైన్‌కు తరలించారు. కరోనా పరీక్షల కోసం వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. మరికాసేపట్లో రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. తిరుమల బాలాజీ నగర్ లో ఈ యువకుడి కుటుంబం నివాసం ఉంటోందని, ఆ ఇంటి చుట్టుపక్కల వారిని హోమ్ క్వారంటైన్ చేశామని, రిపోర్టులు వచ్చిన తరువాత, తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News