ఏపీకి చేరిన కరోనా మెడికల్ కిట్లు

Update: 2020-04-04 16:52 GMT
Coronavirus Medical Kits

కరోనా వైరస్ కేసులు దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా పరీక్షల వేగాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.కరోనా నిర్ధారణ పరీక్షల కొరత రాష్ట్రాలలో తీవ్రంగా ఉండడంతో దీనిని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం మరిన్ని కరోనా మెడికల్ కిట్లను పంపిస్తుంది.

ఈ క్రమంలో ఏపీ రాష్ట్రానికి ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి కరోనా మెడికల్ కిట్లు చేరుకున్నాయి. ఇక గన్నవరం విమానాశ్రయం నుండి స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ కు ఈ మెడికల్ కిట్లను అధికారులు రవాణా చేయనున్నారు.



Tags:    

Similar News