ఏపీలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. 24 గంటల్లోనే 67..
ఆంధ్రప్రదేశ్లో గంతగంటకు కరోనా పెరిగిపోతున్నాయి. బుధవారం సాయంత్రం మరో 24 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో గంట గంటకు కరోనా పెరిగిపోతున్నాయి. బుధవారం సాయంత్రం మరో 24 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కి చేరింది.ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక్క రోజులోనే 67 నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. బుధవరం పాజిటివ్గా తేలినవారిలో ఎక్కువ మంది ఢిల్లీ మార్కజ్ వెళ్లివచ్చినవారు, వారితో కంటాక్ లో ఉన్నవారేనని తెలుస్తోంది.
గుంటూరులో 20, కృష్ణా జిల్లాలో 15, ప్రకాశం 15, కడప 15, పశ్చిమ గోదావరిి 14, విశాఖపట్నం 11, తూర్పు గోదావరి 9, చిత్తూర్ 6, నెల్లూరు 3, కర్నూల్ 1, అనంతపురం2 కేసులు నమోదయ్యాయి.