Coronavirus: ఆంధ్రా యూనివర్శిటీలో కరోనా కలకలం

Coronavirus: 53మంది ఇంజనీరింగ్ విద్యార్ధులకు కోవిడ్ పాజిటివ్‌ * అప్రమత్తమైన యూనివర్శిటీ అధికారులు

Update: 2021-03-27 05:29 GMT

ఆంధ్ర యూనివర్సిటీ (ఫైల్ ఫోటో)

Coronavirus: ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో ఇవాళ్టి నుంచి జరగాల్సిన ఇంజినీరింగ్, ఫార్మసీ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఏయూలో నిన్న 53మంది ఇంజనీరింగ్ విద్యార్ధులకు కరోనా సోకడం.. క్యాంపస్ లో తీవ్ర కలకలంరేపింది. దీంతో పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. స్పందించిన అధికారులు కోవిడ్ నేపధ్యంలో ఏయూ క్యాంపస్, అనుబంధ కళాశాలల్లో నేటి నుంచి జరగాల్సిన ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వాయిదా పడిన ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News