Andhra Pradesh: ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ టూర్

Andhra Pradesh: బలభద్రపురంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ సందర్శించనున్న సీఎం జగన్

Update: 2022-04-21 00:59 GMT

ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ టూర్

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సీఎం జగన్ తో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సీఎం జగన్ ఉదయం పది గంటలకు తాడెపల్లి నివాసం నుంచి బయల్దేరి 11 గంటలకు బలభద్రపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.40 గంటలకు అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. 

Tags:    

Similar News