నేను కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తాను : సీఎం జగన్‌

Update: 2019-07-02 10:28 GMT

స్పందన కార్యాక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌ రివ్యూ చేపట్టారు. అన్నీ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజలు ఇస్తున్న వినతిపత్రాలకు రశీదులు ఇవ్వాలని, సమస్యల పరిష్కారానికి టైమ్‌ బాండ్‌ ప్రకటించాలని, కలెక్టర్లు, ఎస్పీలు ప్రతి ఒక్క అంశాన్ని పర్యవేక్షించాలని అన్నారు. అర్జీదారులకు ఇచ్చే రశీదులను కంప్యూటరైజ్‌ చేసి డేటాబేస్‌లో ఉంచాలని ఆదేశించారు. చెప్పిన వ్యవధిలోగా అధికారులు సమస్యలు పరిష్కారిస్తున్నారో లేదో క్రాస్‌ చెక్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు వీటిని పర్యవేక్షిస్తూ ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేపడతానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా స్పందన కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశీలిస్తామన్నారు సీఎం జగన్‌. ప్రతి మంగళవారం అరగంట పాటు కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి స్పందన కార్యక్రమంపై రివ్యూ చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.  

Tags:    

Similar News