సీఎం జగన్ చేత కేక్ కట్ చేయించిన సీఎస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాడేపల్లి లోని ఆయన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2019-12-21 07:27 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాడేపల్లి లోని ఆయన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని. అనంతరం సీఎం జగన్ చేత కేక్ కట్ చేయించారు. ముఖ్యమంత్రి సలహాదారులు అజయ్ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్ అలాగే అధికారులు ఉన్నతాధికారులు సీఎంకు కేక్ తినిపించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల తర్వాత జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు కావడంతో పలువురు కీలక నేతలు ఆయనను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు సీఎం వైఎస్‌ జగన్‌ కలిసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. వేడుకల అనంతరం సీఎం అనంతరపురం జిల్లా ధర్మవరం పర్యటనకు వెళ్లారు. ఇటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం జిల్లాలో 47 కేజీల భారీ కేక్‌ను కట్‌ చేశారు. జిల్లా కేంద్రాలతో పాటు పలు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News