వైసీపీ ముఖ్యనేతలతో సీఎం జగన్ భేటీ

Update: 2020-03-09 12:39 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ సన్నద్ధం అవుతోంది. దాంతో వైసీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో భేటి అయ్యారు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణలు ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. స్థానికల సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దల సభకు వెళ్లేందుకు నలుగురు సభ్యులను ఖరారు చేసింది వైసీపీ. ప్రస్తుతం ఏపీలో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు రాజ్యసభ స్థానాలకు నామినేట్ చేసింది. మంత్రులతో పాటు అయోధ్య రామిరెడ్డి, పారిశ్రామిక వేత్త పరిమాల్ నత్వానికి చోటు కల్పించింది వైసీపీ.


Full View

  

Tags:    

Similar News