ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. రైతు భరోసా పెంపు..

Update: 2019-10-14 09:23 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రేపు రైతు భరోసా పథకం ప్రారంభంకానుంది. నెల్లూరు జిల్లా కాకుటూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే, రైతు భరోసా ప్రారంభం నేపథ్యంలో వ్యవసాయ మిషన్‌పై సమీక్ష నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రైతులకు రూ.12,500కు బదులు రూ.13,500 ఇవ్వాలని నిర్ణయించారు. ఏటా రైతులకిచ్చే రైతు భరోసా మొత్తాని 13వేల 500కి పెంచాలని నిర్ణయించారు. అయితే, ఈ మొత్తాని ఏడాదిలో మూడు విడతులుగా అందజేయనున్నారు.

Tags:    

Similar News