అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ముందుగా అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన విలువైన ఆస్తుల స్వాధీనంపై దృష్టి పెట్టాలని స్పష్టంచేశారు. అలాగే ప్రభుత్వం అందించిన 11 వందల 50 కోట్ల పంపిణీ త్వరగా పూర్తి చేయాలన్నారు. త్వరలోనే అగ్రిగోల్డ్ యాజమాన్యం, బాధితులు, సీఐడీ అధికారులతో సమావేశం అవుతానన్న జగన్ వారికి సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.