ఏపీ సీఎం జగన్ను బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సోమవారం కలిశారు. ఫిబ్రవరి 7న తమ కుమారుడు రిత్విక్ వివాహానికి రావాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా సీఎం జగన్ను ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబును కూడా సీఎం రమేష్ తన కుమారుడి వివాహానికి ఆహ్వానించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులను, సినీ ప్రముఖులను ఆయన ఆహ్వానించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రధాని మోదీని కలిసి వివాహానికి రావాల్సిందిగా సీఎం రమేష్ ఆహ్వానించారు. కాగా ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో, రిత్విక్ నిశ్చితార్థం గత ఏడాది నవంబర్లో దుబాయ్ జరిగింది.