ఇవాళ విశాఖలో సీఎం జగన్ పర్యటన

Visakha: విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలకు జగన్, పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్న జగన్.

Update: 2022-02-09 02:16 GMT

ఇవాళ విశాఖలో సీఎం జగన్ పర్యటన

Visakha: ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఇవాళ విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో సీఎం పాల్గొంటారు. ఉదయం 10.15కు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో బయలు దేరి 11 గంటలకు విశాఖ చేరుకుంటారు. రోడ్డు మార్గాన 11.30 గంటలకు శారదాపీఠం చేరుకుంటారు. ఒంటి గంట వరకు శారదా పీఠంలో జరిగే పూజా కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 1.25కు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుని తిరుగు ప్రయాణం అవుతారు. సీఎం పర్యటన సందర్భంగా విశాఖలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News