అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ఏపీ సీఎం జగన్ యాడ్ బోర్డు దర్శనమిస్తోంది. ఈ యాడ్ బోర్డును నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల ఏర్పాటు చేశారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో అమెరికాలోని తెలుగువాళ్లంతా జాగ్రత్తలు తీసుకోవాలని యాడ్ బోర్డులో సీఎం జగన్ సందేశం వుంది. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత టైం స్క్వేర్లో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సందేశం పట్ల ప్రవాసాంధ్రుల్లో హర్షం వ్యక్తమవుతోందని నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల తెలిపారు