పులివెందులలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. పాలకేంద్రం దగ్గర ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. వైఎస్ వివేకా సతీమణీ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళులు అర్పించిన అనంతరం నేరుగా పులివెందుల చేరుకున్న జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.