నెల రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణపై సీఎం అదికారులతో సమీక్ష నిర్వహించారు. నెలఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం నియంత్రించాలనే ఆర్డినెన్స్ తీసుకు వచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు.
డబ్బు, మద్యం పంపినట్లు రుజువు అయితే ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు, మూడేళ్ల జైలు శిక్ష విధించాలన్నారు. గ్రామాల్లో మహిళా పోలీసు, పోలీసు మిత్రలను ఉపయోగించుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికల నిర్వాహణ దేశానికే ఆదర్శం కావాలన్నారు.