సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం జగన్‌

Update: 2020-01-14 11:08 GMT

ఏపీ సీఎం జగన్ కృష్ణాజిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనున్నారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్లబండ్ల పోటీలను జగన్ తిలకించారు. లింగవరం రోడ్‌ కే కన్వెన్షన్‌లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌ చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. అలాగే ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును ఆసక్తిగా తిలకించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.  


Full View


Tags:    

Similar News