Breaking: నేడు సాయంత్రం ఢిల్లీకి సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు.

Update: 2019-12-05 10:32 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు. సాయంత్రం 4.00 గంటలకు సీఎం నివాసం నుంచి బయలుదేరి 4.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రం 6.15గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.

అనంతరం సాయంత్ర 7 గంటలకు జన్‌పథ్‌‌-1కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేసి శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. అనంతరం అదే రోజు కుదిరితే అమిత్ షా తోను సమావేశం అవుతారు. రాత్రి తిరిగి అమరావతి చేరుకుంటారు.కాగా గురువారం అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొన్నారు.

శుక్రవారం సీఎంకు సంబంధించిన క్విడ్-ప్రో-క్వో కేసు విషయంలో సిబిఐ కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉండగా. ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే, రాష్ట్ర విభజన మరియు రాష్ట్రానికి నిధుల విడుదలకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సిఎం సమావేశమవుతారని వైయస్ఆర్సిపి సర్కిల్స్ ధృవీకరిస్తున్నాయి.

Tags:    

Similar News