మనం నాటే ప్రతి మొక్క భూమాతకు మేలు చేస్తుంది : సీఎం జగన్

Update: 2019-08-31 07:40 GMT

మనం నాటే ప్రతి మొక్క భూమాతకు మేలు చేస్తుందని అన్నారు ఏపీ సీఎం జగన్. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో ప్రభుత్వం ఆధ్వర్యంలో 70వ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్నారు. మొక్కలు నాటి అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను సీఎం ప్రారంభించారు. మనం పెంచే ప్రతి చెట్టు తర్వాతి తరానికి ఫలాలు ఇస్తోందన్నారు. ఈ సీజన్‌లో 25 కోట్ల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టినట్లు జగన్‌ వెల్లడించారు. ఇప్పటికే 4 కోట్ల మొక్కలు నాటామని ఈ ఒక్క రోజే కోటి మొక్కలు నాటుతున్నట్లు ప్రకటించారు. మొక్కలు పెంచేందుకు ముందుకొస్తే గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. 

Tags:    

Similar News