Independence Day 2021: ఏపీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

Independence Day 2021: ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు

Update: 2021-08-15 02:30 GMT

జండాఆవిష్కరణ చేయనున్న సీఎం జగన్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Independence Day 2021: ఇవాళ ఉదయం 9 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రిహార్సల్స్ కూడా పూర్తి చేసింది. పోలీసుల కవాతుతో పాటు రాష్ట్ర ప్రగతిని సూచించే విధంగా శకటాలను కూడా సిద్ధం చేశారు. ఇందులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలతో పాటు ఇతర ప్రగతి సూచికలను కూడా ప్రదర్శించబోతున్నారు. అయితే ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షాలు కురుస్తుండటంతో స్టేడియం బురదమయంగా మారింది. 

Tags:    

Similar News