గొల్లపూడి మృతిపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

Update: 2019-12-12 11:16 GMT
జగన్‌

బ‌హుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీ రావు మృతి ప‌ట్ల ఏపీ సీఎం జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ ప‌రిశ్రమ మంచి వ్యక్తిని కోల్పోయింది. వినూత్నమైన డైలాగ్‌ డెలివరీతోపాటు, రచనల్లో, నాటకాల్లో తనదైన శైలితో ఆయన అందరిని ఆకట్టుకున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో గర్వించదగిన స్థానాన్ని సంపాదించారని తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కి ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని జ‌గ‌న్ అన్నారు.  

Tags:    

Similar News