Breaking: వ్యక్తిగత సహాయకుడు మృతి.. అర్థంతరంగా ఢిల్లీ పర్యటన ముగించిన సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ అర్థంతరంగా పర్యటనను ముగించుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా కడప ఎయిర్పోర్టుకు అక్కడనుంచి నారాయణ స్వగ్రామానికి బయలుదేరారు.
ఈ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు చేరుకొని నారాయణ అంత్యక్రియలకు హాజరవుతారు. తిరిగి సాయంత్రం తాడేపల్లి చేరుకోనున్నారు. కాగావైయస్ కుటుంబంతో మూడు దశాబ్దాలకుపైగా నారాయణకు అనుబంధం ఉంది. కాగా నేడు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ శాఖా మంత్రి అమిత్ షా లతో సీఎం సమావేశం కావాల్సి ఉన్నా.. వ్యక్తిగత సహాయకుడు మృతితో సమావేశం రద్దయింది.