CM Chandrababu: ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన
CM Chandrababu: ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పర్యటించనున్నారు.
CM Chandrababu: ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పర్యటించనున్నారు. తిరుపతి వేదికగా ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు భారత విజ్ఞాన్ సమ్మేళన్ జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మోహన్ భగవత్, షెకావత్ పాల్గొననున్నారు.
ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు.. తిరుపతిలో నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. మరోవైపు.. తిరుపతిలో ప్రముఖుల పర్యటన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.