హోంమంత్రి సుచరిత ఎదుటే వైసీపీ నేతల బాహాబాహీ

Update: 2020-03-10 08:01 GMT
హోంమంత్రి సుచరిత ఎదుటే వైసీపీ నేతల బాహాబాహీ

గుంటూరు జిల్లా కాకుమానులో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బాహాబాహీ జరిగింది. సాక్షాత్తూ హోంమంత్రి సుచరిత ఎదుటనే ఒకరినొకరు నెట్టుకున్నారు. మంత్రి సొంత నియోజకవర్గంలోని ప్రత్తిపాడులో కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేయగా ఈ గొడవ జరిగింది. కాకుమానులోని విష్ణు ఆలయ కల్యాణ మండపంలో స్థానిక సంస్థలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.

ఇదే సమయంలో రేటూరు ఆలయ ట్రస్టు సభ్యుల నియామకమంపై కూడా చర్చ జరిగింది. ఇక్కడే రెండు వర్గాలు తమ, తమ సభ్యులను ప్రతిపాదించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇరువర్గాలకు నచ్చచెప్పి గొడవ సర్దుమణిగేలా చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు హోంమంత్రి. పద్దతిగా కూర్చోని మాట్లాడుకోవాలి తప్ప ఇటువంటి భౌతిక దాడులు కరెక్ట్ కాదని క్యాడర్‌కు సూచించారు. 

Tags:    

Similar News