నటుడు విజయ్‌చందర్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి

సినిమాల్లో.. సాయిబాబాగా, క‌రుణామ‌యుడులో ఏసుప్ర‌భుగా న‌టించాడు. ఇక జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు, ష‌ర్మిల పాద‌యాత్ర చేసిన‌ప్పుడు

Update: 2019-11-11 11:37 GMT

ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్(fdc) ఛైర్మెన్ గా, సినీ నటుడు విజయ్‌చందర్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా విజయ్‌చందర్ తొమ్మిదేళ్లుగా వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. విజ‌య్‌చంద‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో సుప‌రిచితుడు. ఆయ‌న సినిమాల్లో.. సాయిబాబాగా, క‌రుణామ‌యుడులో ఏసుప్ర‌భుగా న‌టించాడు. ఇక జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు, ష‌ర్మిల పాద‌యాత్ర చేసిన‌ప్పుడు ఆయ‌న వైసీపీకి ఎంతో స‌పోర్ట్‌గా ఉన్నారు. 

Tags:    

Similar News