Andhra Pradesh: మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు

Andhra Pradesh: ఇవాళ కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.

Update: 2021-04-15 06:54 GMT

దేవినేని ఫైల్ ఫోటో

Andhra Pradesh: మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు జారీ చేశారు. సీఎం జగన్ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఇవాళ ఉదయం కర్నూలు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని గొల్లపూడిలోని ఆయన నివాసంలో నోటీసులు అందించారు.. ఈ నెల 7న దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు.. అందులో మార్ఫింగ్ చేసిన జగన్ వీడియోలు ప్రదర్శించారని అభియోగం మోపారు.. ఈ మేరకు 464, 465, 468, 469, 470, 471, 505, 120 బి సెక్షన్ల కింద ఉమాపై సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు. 

Tags:    

Similar News