పౌడర్‌ డబ్బా మీద పడడంతో చిన్నారి మృతి

Update: 2019-11-09 07:11 GMT

ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి మీద పౌడర్‌ డబ్బా పడడంతో చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. గుంటూరు బాలాజీనగర్‌ 6వ లైనుకు చెందిన తురకా ఏసుబాబు కుమార్తె తొమ్మిది నెలల జస్సి ఇంట్లో ఆడుకుంటోంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు అటకమీద ఉన్న పౌడర్‌ డబ్బా పాప మెడపై పడింది. దీంతో పాప మెడకు తీవ్ర గాయమైంది. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు బాలికను చికిత్స నిమిత్తం గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. అయితే ఇంటికి తీసుకువచ్చిన అనంతరం పాప తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. పాప మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. పాప ఇకలేదన్న వార్తను తల్లదండ్రులు జీర్ణించుకోలేక గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.     

Tags:    

Similar News