CM Jagan: ఇవాళ విజయవాడలో పర్యటించనున్నా సీఎం జగన్

CM Jagan: కృష్ణలంక రాణీగారి తోట వద్ద రిటెయినింగ్‌ వాల్‌ నిర్మాణానికి శంకుస్ధాపన కార్యక్రమం జరుగనుంది.

Update: 2021-03-31 05:13 GMT

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: సీఎం జగన్ ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కృష్ణానది వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న కృష్ణలంక వాసులకు శాశ్వత పరిష్కారంగా 125 కోట్లతో రిటెయినింగ్‌ వాల్‌ నిర్మాణానికి సీఎం శంకుస్ధాపన చేయనున్నారు. కృష్ణలంక రాణీగారి తోట వద్ద రిటెయినింగ్‌ వాల్‌ నిర్మాణానికి శంకుస్ధాపన కార్యక్రమం జరుగనుంది. అనంతరం తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైస్సార్ భీమా క్లైమ్‌లను సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు.

Tags:    

Similar News