సీఎంకు కృతజ్ఞతలు : జగన్‌కు చంద్రబాబు లేఖ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి లేఖ రాశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Update: 2020-04-09 05:17 GMT
Chandrababu, CM YSJagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి లేఖ రాశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ లేఖలో విశాఖ మెడ్ టెక్ విషయాన్ని వెల్లడిస్తూ.. దేశంలోనే తొలి మెడికల్ ఎక్విప్ మెంట్ తయారీ పార్క్ గా విశాఖపట్నంలో నెలకొల్పిన మెడ్ టెక్ జోన్ ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించడం సంతోషమని అన్నారు.

అంతేకాకుండా గత 10 నెలల కాలంలో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధి చేసి ఉంటే దేశానికే మెరుగైన సేవలు అందించే స్థాయిలో ఉండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఇక ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో దీనిపైన స్పందించారు చంద్రబాబు... దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న నేపధ్యంలో పనులు కోల్పోయి ఇబ్బంది పడుతున్న చేతివృత్తులవారికి, పెదవారికి అయిదు వేల రూపాయలను అందించాలని కోరారు.. ఇక పంటలకు మద్దతు ధర, ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు. 

Tags:    

Similar News