చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు

Update: 2020-05-25 02:14 GMT

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయింది. విశాఖ పర్యటనకు ఏపీ డీజీపీ నుంచి అనుమతి రావడంతో విశాఖ వెళ్లేందుకు చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, ప్రయాణికులు తక్కువగా ఉన్న కారణంతో నేడు విశాఖ, విజయవాడ వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు. దీంతో చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. విశాఖ పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు.

విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, విమాన సర్వీసులను నిలిపేయడం వైసీపీ ప్రభుత్వ కుట్రగా టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయడు ధ్వజమెత్తారు. సోమవారం ఒక్కరోజే ఏపీకి విమాన సర్వీసులు బంద్ చేయడం వైసీపీ కుట్రలో భాగమేనన్నారు. ఒక్కరోజే విశాఖ, విజయవాడ ఎయిర్ పోర్టుల మూత వేయడం, మళ్లీ మంగళవారం సర్వీసులు ఉన్నాయని చెప్పడం దీనికి బలం చేకూరుస్తోందని చెప్పారు.

Tags:    

Similar News