Chandrababu Naidu: ఇవాళ్టి నుంచి చంద్రబాబు బస్సు యాత్ర

Update: 2020-02-19 05:57 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు యాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు బుధవారం శ్రీకారం చుడుతున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.

ఆ తర్వాత ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మేదరమెట్ట బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో ప్రసంగిస్తారు. రాత్రికి టీడీపీ నాయకులతో సమావేశం అవుతారు. ఆపై రాత్రి 10 గంటలకు ఉండవల్లికి తిరుగు ప్రయాణంకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45రోజుల పాటు టీడీపీ ప్రజా చైతన్య బస్సుయాత్రను చేయనుంది. 

Tags:    

Similar News