పోలవరం రివర్స్ టెండరింగ్పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది రివర్స్ టెండరింగ్ కాదని రీ టెండరింగ్ అని ఆరోపించారు. ఇప్పటికే 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయని ఈ పరిస్థితుల్లో రివర్స్ టెండరింగ్ కు వెళ్తే ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరినీ సంప్రదించకుండా పోలవరం ప్రాజెక్టును ఏకపక్షంగా నిలిపేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.