Chandrababu: జయహో బీసీ సదస్సు.. వైసీపీ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోంది

Chandrababu: జయహో బీసీ కోసం 40 రోజుల కార్యాచరణ రూపొందించామన్న చంద్రబాబు

Update: 2024-01-04 12:15 GMT

Chandrababu: జయహో బీసీ సదస్సు.. వైసీపీ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోంది

Chandrababu: వైసీపీ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జయహో బీసీ సదస్సు నిర్వహించారు. టీడీపీ పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందన్నారు. వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారో జయహో బీసీ సదస్సు ద్వారా తెలియజేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం రాగానే 34 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారని ఆయన విమర్శించారు. జయహో బీసీ కోసం 40 రోజుల కార్యాచరణ రూపొందించామని... జయహో బీసీ లక్ష్యాను పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా ప్రణాళిక రచించామని చంద్రబాబు వివరించారు.

Tags:    

Similar News