జగన్మోహన్రెడ్డి పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. తన 41ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత అరాచక, అనాగరిక పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు. వైఎస్ హయాంలోనూ ఇంతటి దౌర్జన్యం జరగలేదని, అప్పుడు కేవలం ఒక్క జిల్లాకే పరిమితమైతే, ఇప్పుడు రాష్ట్రమంతటా రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. వంద రోజుల జగన్ పాలనలో టీడీపీ శ్రేణులపై జరిగిన దాడులు, కేసులను వివరించిన చంద్రబాబు ఇక వైసీపీ దౌర్జన్యాలు సాగనివ్వబోమంటూ హెచ్చరించారు.