వైసీపీ సర్కార్‌పై చంద్రబాబు విమర్శలు

ఏపీలో అధికార వైసీపీ నేతల చేతిలో దాడులకు గురవుతున్న టీడీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రకటించారు. పల్నాడు పరిధిలోని బాధితుల కోసం గుంటూరులో పునరావాసం కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

Update: 2019-09-03 06:26 GMT

ఏపీలో అధికార వైసీపీ నేతల చేతిలో దాడులకు గురవుతున్న టీడీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రకటించారు. పల్నాడు పరిధిలోని బాధితుల కోసం గుంటూరులో పునరావాసం కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. బాధితులంతా ఈ పునరావాస కేంద్రానికి రావాలంటూ కోరారు. ఎవరైనా అడ్డుకుంటే తానే స్వయంగా ఆయా గ్రామాలకు వస్తానంటూ చంద్రబాబు ప్రకటించారు. గుంటూరు జిల్లా టీడీపీ నేతలతో టెలికాన‌్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అంతులేని అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన పోలీసులే నిస్సహాయులైతే పరిస్ధితులు ఇలాగే ఉంటాయన్నారు. 

Tags:    

Similar News