Chandrababu: చంద్రగిరిలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారు.. కొన్ని చోట్ల పోలింగ్ బూత్లు మార్చేశారు
Chandrababu: ఓట్ల జాబితాలోని అక్రమాలను ఈసీ దృష్టికి తీసుకెళ్తాం
Chandrababu: చంద్రగిరిలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారు.. కొన్ని చోట్ల పోలింగ్ బూత్లు మార్చేశారు
Chandrababu: చంద్రగిరిలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కొన్ని చోట్ల పోలింగ్ బూత్లు మార్చేశారని తెలిపారు. ఒకే పేరు కలిగిన వ్యక్తికి మూడు బూత్ల్లో ఓటు ఉందని చెప్పారు. సచివాలయ సిబ్బంది సాయంతో దొంగ ఓట్ల నమోదు చేయించారని ఆరోపించారు. అధికారులను చట్టప్రకారం పనిచేయాలని సూచించారు. అక్రమాలు చేసిన అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఓట్ల జాబితాలోని అక్రమాలను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.