కోడెల మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు చలించిపోయారు. కోడెల మృతిని తట్టుకోలేక బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. వేధింపులు భరించలేకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆత్మహత్య చేసుకున్నారంటే ఎంత మానసిక క్షోభకు గురయ్యారో అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
కోడెల పులిలా బతికారని భయం ఎరుగని నేతని... అలాంటి కోడెల ఆత్మహత్య చేసుకోవడాన్ని తాను జీర్జించుకోలేకపోతున్నానని అన్నారు. కోడెలను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న చంద్రబాబు మూడు నెలలుగా తీవ్ర వేధింపులకు గురిచేశారని అన్నారు. ఎప్పుడు ఏ అవమానం చేస్తారోనని కోడెల భయపడేవారని అయితే ఎన్ని కేసులు పెట్టినా పోరాడదామని ధైర్యంగా ఉండాలని తాను కోడెలకు చెప్పానన్నారు.
కాసేపట్లో హైదరాబాద్ రానున్న చంద్రబాబు రేపు కోడెల మృతదేహంతోపాటు నర్సరావుపేట వెళ్లనున్నారు. రేపు ఉదయం అభిమానుల సందర్శన కోసం గుంటూరు టీడీపీ ఆఫీస్లో కోడెల మృతదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం రేపు నర్సరావుపేటలో కోడెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.