వైసీపీ ప్రభుత్వంలో ఏపీకి చీకటి రోజులు వచ్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారి కళకళలాడుతున్నా రాష్ట్రంలో విద్యుత్ కొరత వచ్చిందన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం మానసికంగా వేధించడం వైసీపీ విధానంగా మారిందని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ వేధింపుల వల్లే మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు .