Andhra Pradesh: విజయవాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

Andhra Pradesh: విజయవాడ మేయర్‌ గెలుపే మన లక్ష్యం -చంద్రబాబు * ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు పెడుతున్నారు -చంద్రబాబు

Update: 2021-03-07 08:54 GMT

చంద్రబాబు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: విజయవాడ మేయర్‌ పీఠం గెలవడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. విజయవాడ నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తీసుకువస్తామని అన్నారు. ఇప్పుడు అదే కేంద్రం ఎదుట మెడలు దించుకొని ఉన్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు, దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

Tags:    

Similar News