ఇవాళ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

Chandrababu: కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు

Update: 2024-04-04 06:07 GMT

ఇవాళ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

Chandrababu: గోదావరి జిల్లాల్లో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు కొవ్వూరుకు చేరుకుని అక్కడ ప్రజాగళం సభలో పాల్గొంటారు. ఆ తర్వాత గోపాలపురంలో చంద్రబాబు పర్యటించి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థుల తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. అనంతరం రాత్రికి నల్లజర్లలో చంద్రబాబు బస చేయనున్నారు.

Tags:    

Similar News