వారంలో ఇద్దరు నేతల్నికోల్పోయాం:చంద్రబాబు

Update: 2019-09-21 10:05 GMT

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ డాక్టర్ ఎన్. శివప్రసాద్ అనారోగ్యంతో కన్నుమూయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. నా చిరకాల మిత్రుడు, మాజీ ఎంపీ, టీడీపీ నేత, డా.ఎన్ శివప్రసాద్‌ గారి మరణం విచారకరం. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో హామీల అమలు కోసం రాజీలేని పోరాటం చేశారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటు అన్నారు చంద్రబాబు. శివప్రసాద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం పార్టీకి తీరని లోటు అన్నారు చంద్రబాబు.



Tags:    

Similar News